నష్టాల పాలైన మార్కెట్లు

నష్టాల పాలైన మార్కెట్లు

ముంబై : భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల పాలయ్యాయి. మధ్యాహ్నం వరకూ సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. చైనా వివాదం గురించి అఖిలపక్ష సమావేశ నిర్వహణకు ప్రధాని మోదీ సిద్ధం కావటంతో మదుపర్లలో కొత్త భయాలు మొదలయ్యాయి. అమ్మకాలకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 33,507కి, నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 9,881 వద్ద నిలిచాయి. మారుతి సుజుకి (4.15%), భారతి ఎయిర్ టెల్ (3.43%), యాక్సిస్ బ్యాంక్ (2.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.08%), బజాజ్ ఫైనాన్స్ (1.31%) బాగా లాభాల్ని గడించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.00%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.92%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.58%), హీరో మోటో కార్ప్ (-1.36%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos