ముంబై : స్టాక్ మార్కెట్లు గురు వారం స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9.41 గంటల వేళకు సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 40,622 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,984 వద్ద నిలిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక శాతం వరకు లాభపడింది. భారతీ ఎయిర్టెల్ 1.4 శాతం నష్టపోయింది.