అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ అమరావతిలో స్థిరాస్తి వ్యాపారాల విస్తరణ కోసం విదేశీ పర్యటనలు చేసారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మంగళవారం ట్విట్టర్లో విమర్శిం చా రు.’అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్ర బాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజకిస్థాన్, మలేషియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశా’ని తప్పుబట్టారు.