గుంటూరు: మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన నామపత్రం చెల్లదని ఎన్నికల అధికారి తెలిపారు. కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లాలో చెల్లదని వివరించారు.నోటరీ చట్టంలోని తొమ్మిదో సెక్షన్ ప్రకారం దాఖలు చేసిన నామ పత్రం చెల్లదని పేర్కొన్నారు. 24 గంట ల్లోగా అదనపు పత్రాల్ని సమర్పించాలని కోసం లోకేశ్కు గడువు ఇచ్చారు. లోకేశ్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైకాపా అభ్యర్థిగా ప్రస్తుత విధానసభ సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు.