రూ.68వేల కోట్లపైగా బకాయిలు మాఫీ చేసిన ఆర్‌బిఐ

రూ.68వేల కోట్లపైగా బకాయిలు మాఫీ చేసిన ఆర్‌బిఐ

ముంబై : బ్యాంకుల నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు పొందిన రుణాల్లో లక్ష రూపాయలు చెల్లించలేకపోతే ముక్కు పిండి వసూలు చేసే, లేక ఆస్తులను జప్తు చేసే కేంద్ర విధానాలు మాత్రం బడాబాబులకు వర్తించడం లేదు. సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం కింద ఆర్బిఐ నుంచి బకాయిల రద్దు వివరాల్ని సమీకరించారు. 2020 ఫిబ్రవరి 16 వరకూ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి బకాయిలు రూ.68,607 కోట్ల రుణాలను రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్బి) కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయినా మెహుల్ చోక్సీ చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5,492 కోట్లు, సందీప్, సంజరు ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్ఎంసిజి సంస్థ ఆర్ఇఐ ఆగ్రో లిమిటెడ్ రూ. 4314 కోట్లు, జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ రూ.4,076 కోట్లు, కాన్పూర్ లోని రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.2,850 కోట్లు, బాబా రామ్దేవ్ బాలకష్ణ గ్రూప్ కంపెనీ కొనుగోలు చేసిన రుచి సోయా ఇండిస్టీస్ లిమిటెడ్కు చెందిన రూ.2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్ కంపెనీ రూ.2,012 కోట్లు, విజరు మల్య కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన రూ.1,943 కోట్లను ఆర్బిఐ రద్దు చేసింది. కాగా విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బిఐ నిరాకరించిందని గోఖలే తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos