ఆరోపణలు చేసిన అమ్మాయి అదృశ్యం

ఆరోపణలు చేసిన అమ్మాయి అదృశ్యం

లఖ్నవ్:: కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత స్వామి చిన్మయా నంద్ తనను వేధిస్తున్నారని ఆరోపించిన విద్యార్థిని అదృశ్యం కలకలాన్ని రేపుతోంది. ఉత్తరప్రదేశ్, షాజహాన్పూర్లోని ఎస్ఎస్ లా కాలేజ్ డైరెక్టర్ అయిన చిన్మయానంద తనను వేధిస్తున్నారని ఆ కళాశాల విద్యార్థిని ఒకరు తన ఫేస్ బుక్లో వీడియోను పోస్టు చేసింది. ఎందరో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించింది. ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తీకరించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడి,ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంది. వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె కళాశాల వసతి గృహం నుంచి అదఅశ్యమైంది. గత శనివారం నుంచి ఆమె ఫోన్ సిచ్చాఫ్లో ఉండగా ఆదివారం నుంచి విద్యార్థిని కనిపించకుండా పోయింది. తన కుమార్తెను చిన్మయానంద అపహరించారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమె బస చేసిన వసతి గృహం గదిని సీజ్ చేయాలని,ఇందువల్ల సాక్ష్యాధారాలు మార్చే వీలుండదని కోరారు. పోలీసులు విద్యార్థిని కోసం గాలింపు మొదలుపెట్టారు. విద్యార్థిని వైరల్ వీడియో గురించి తనకేమీ తెలియదని షాజహాన్ పూర్ ఏఎస్పీ చిన్నప్ప తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos