ఐదు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఐదు జిల్లాలకు పిడుగుపాటు  హెచ్చరిక

అమరావతి : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో మందస, పలాస, మెళియపుట్టి, నందిగామ, వజ్రపు కొత్తూరు, టెక్కలి, పాతపట్నం, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, కొమరాడ, మక్కువ, సాలూరు ప్రాంతాలలో పిడుగుపాటు సంభవిస్తుందని లెక్కగట్టినట్లు పేర్కొంది. గుంటూరు జిల్లాలో శావల్యాపురం, రొంపిచర్ల, నరస రావు పేట, చిలకలూరి పేట, వినుకొండ, నూజెండ్ల, గురజాల, రెంటచింతల, కారంపూడి, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, అద్దంకి, మార్టూరు, యద్దన పూడి, దోర్నాల, అర్ధవీడు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, గిద్దలూరు, కర్నూలు జిల్లా కౌతాలం, ఆదోని, హోలగుండ పరిసరాలలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos