నేడు మద్యం అంగళ్ళ చివరి రోజు

అమరావతి:రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం అంగళ్లకు సోమవారమే చివరి రోజు. మంగళవారం నుంచి ప్రభుత్వమే వీటిని నిర్వహించనుంది. వ్యాపారులు సోమ వారం ఉదయం నుంచి అంగళ్లను ఖాళీ చేస్తున్నారు. అబ్కారి శాఖ బాడుగకు తీసుకున్న దుకాణాల్లో మద్యం సీసాల్ని అమర్చుతోంది. సిబ్బం ది నియామకం, అమ్మకాల ఆరంభ సన్నాహాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలి దశగా ప్రస్తుతం ఉన్న 4,380 దుకాణాలకు బదులుగా 3,448 దుకాణాలనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తాజా సమాచారం