బస్సు దొరికె.. ప్రాణాలు పోయా..

బస్సు దొరికె.. ప్రాణాలు పోయా..

గ్వాలియర్ : ముప్ఫై నాలుగు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రీకవరీ ఏజంట్లు ‘హైజాక్’ చేశారు. బస్సు కొనుగోలు కు తీసుకున్న రుణాన్ని బస్సు యజమాని చెల్లించ నందున రుణ సంస్థ ఏజంట్లు హర్యానాలోని గుర్గావ్ నుంచి గ్వాలియర్ వెళుతోన్న ఈ బస్సును అడ్డగించి దారి మళ్లించారు. దరిమిలా ఆ బస్సు ప్రయాణికులు చేసిన ఫిర్యాదు పై పోలీసులు కేసు దాఖలు చేసారు. ‘బస్సు డ్రైవర్, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఏజంట్లపై కేసు పెట్టామ’ని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బస్సు యజమాని తీవ్ర ఉద్విగ్నతకు లోనై ప్రాణాలు కోల్పోయాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos