ఇంత దారుణ హత్యలు మరెక్కడా చూసుండరు..

ఇంత దారుణ హత్యలు మరెక్కడా చూసుండరు..

కొన్ని నేరాలు దారుణంగా ఉంటాయి. చిత్రవిచిత్రంగా ఉండి ప్రజలను భయాందోళనకు గురి చేసేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మృతదేహాలతో కొందరు ఆటలాడుకుంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో చదివాం.. చూశాం. కానీ ఒక మహిళ మనుషులను దారుణంగా హత్య చేసి మృతదేహాలతో కేకులుబిస్కెట్లు తయారుచేసి వాటిని ఇతరులకు తినిపించిన దారుణ సంఘటన వివరాలు దాదాపు దశాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చింది. మనుషుల మృతదేహాలతో బేకరీ నిర్వాహకురాలు తన వంటకు వినియోగించుకోవడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. సంఘటనలు ఇటలీలో 1939-40 సంవత్సరాల మధ్య చోటుచేసుకున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. ఇటలీలోని కోరేజియోలో నివసిస్తున్న లియోనార్డా సియాన్సియుల్లి సబ్బులుకేకుల తయారీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దీంతో ఆమెకు ప్రాంతంలో ఎంతోమంది పరిచయమయ్యారు. ఆమెతో అందరూ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆమె సడన్ గా ముగ్గురుని హతమార్చిన విషయం ఆలస్యంగా దేశ పోలీసులు కనిపెట్టారు. ముగ్గురు మహిళలు అదృశ్యమైన కేసుల్లో భాగంగా విచారణ చేస్తుండగా లియోనార్డ సియాన్సియుల్లి పేరు వినిపించడంతో విచారణ చేయగా ఆమె మూడు దారుణహత్యలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

మొదటి హత్య..
ఫౌస్టినా సెట్టీ అనే యువతికి పెళ్లి కాలేదు. ఆమె ఎంతో సన్నిహితంగా ఉంటుండడంతో లియోనార్డ సియాన్సియుల్లి నీకు భర్తను వెతుకుతున్నా అని చెప్పేది. క్రమంలో రోజు నీకు భర్తను వెతికాను.. ఇంటికి రావాలని ఆమెను కోరింది. దీంతో ఆమె ఇంటికి ఫౌస్టినా వెళ్లింది. సందర్భంగా జ్యూస్ ఇచ్చి మర్యాద చేసింది. కొంతసేపటికి ఆమె స్పృహ  తప్పింది. ఎందుకంటే జ్యూస్ లో ఆమె మత్తు మందు కలపడంతో మత్తులోకి జారుకుంది. దీంతో ఫౌస్టినాను లోపలికి తీసుకువెళ్లి ఆమెను గొడ్డలితో హతమార్చింది. క్రూరంగా ఆమె శరీరాన్ని 9 భాగాలు చేసింది. అంతేకాకుండా హత్యచేయగా వచ్చిన రక్తాన్ని పెద్ద గిన్నెలో పట్టి పక్కనపెట్టింది. శరీరాన్ని ముక్కలుమక్కులుగా చేసి పెద్దకుండలో వేసింది. అనంతరం 7 కిలోల కాస్టిక్ సోడాను అందులో వేసి శరీర భాగాలన్నీ పూర్తిగా ఉడికించింది. అవి ఏకంగా పానకంలా తయారయ్యే వరకు చేసింది. అలా తయారైన రసాన్ని ఖాళీగా ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో వేసి నిల్వ ఉంచింది. ఇక ఫౌస్టినా శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని బాగా ఎండబెట్టింది. ఎండిన రక్తంతో పిండిచక్కెరచాక్లెట్పాలుకోడిగుడ్లు తదితరాలు కలిపి కేకు తయారు చేసింది. రక్తంతో కరకరలాడే టీ కేక్స్ తయారు చేసింది. వాటిని ఆమె ఇంటికి వచ్చిన వారికి వడ్డించింది. వారు తినేలా చేసింది. అయితే ఆమె కూడా తినడం గమనార్హం.
రెండో హత్య..
అదే ప్రాంతానికి చెందిన ఫ్రాన్సెస్కా సోవీ అనే మహిళ నిరుద్యోగి. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి లియోనార్డ సియాన్సియుల్లి పిలిచింది. సేమ్ పై ఘటన మాదిరి జ్యూస్లో మత్తు కలిపి ఇచ్చి తర్వాత ఆమెను దారుణంగా హతమార్చింది. ఆమె శవాన్ని ముక్కలు చేసి కేకులుసబ్బులు తయారు చేసింది.
మూడో హత్య..
వర్జీనియా కాసియోప్పో. ఈమె చాలా అందగత్తె. శరీరం తెల్లగా.. అందంగా ఉంది. సందర్భంగా ఆమె చర్మంతో కేకులు తయారు చేయాలని భావించింది. దీంతో ఆమెను కూడా హతమార్చింది. ఆమెను హతమార్చేసి అనుకున్నట్లే ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా వలిచి ఉడకబెట్టింది. కొవ్వునంతా కరిగించి వాటితో కేకులు తయారు చేసింది.హత్యకు గురైన మహిళల కుటుంబసభ్యులు తమ వాళ్లు అదృశ్యమయ్యారని ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వారి కోసం తీవ్రంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. సందర్భంగా అదృశ్యమైన మహిళల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సందర్భంగా వారి ఇళ్లల్లో లియోనార్డ సియాన్సియుల్లికి సంబంధించిన లేఖలు కనిపించాయి. వాటిపై ఆమె అడ్రస్ కూడా రాసి ఉంది. అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. మొదట ఆమె తటపటాయించగా అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా పై ఘటనలు వెలుగులోకి వచ్చాయి.అయితే హత్యోదంతాలు విన్న కోర్టు ఆశ్చర్యపోయింది. ఇన్ని చేసిన ఆమె ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా నేరాలు అంగీకరించింది. పైగా మనుషుల మృతదేహాలతో గొప్ప వంటకం చేసినట్లుగా చెప్పుకుంది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో సంఘటనలను చూసి అందరూక్రేజీ సీరియల్ కిల్లర్ మదర్అని పిలుస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos