కొత్త లారీకి … వేలాడదీసినట్లు..

కొత్త లారీకి … వేలాడదీసినట్లు..

ముంబై: విజయ దశమి పండుగ రోజు రాఫెల్ యుద్ధ విమానానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆయుధ పూజ చేయటం కొత్త లారీకి …..వేలాడ దీసినట్లుందని రక్షణ శాఖ మాజీ మంత్రి శరద్ పవర్ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘దేశ భద్రత దృష్ట్యా తీసుకునే నిర్ణయాల పట్ల నాకు ఎలాం టి అనుమానాలూ లేవు. అయితే ఓ మాట చెప్పాలనుకుంటున్నా. చెడు దృష్టి తగల కుండా రఫెల్ యుద్ధ విమానానికి రక్షగా నిమ్మ కాయలు, మిరప కాయలు కట్టడం… కొత్త ట్రక్కుకు వేలాడదీసినట్లుంద’ని విమర్శించారు. రెండు రోజుల ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కూడా రాజనాథ్ పూజల్ని ఎద్దేవా చేసారు. ‘ఇలాంటి నాటకాలు ఆడాల్సిన పని లేదు. బోఫోర్స్ ఆయుధాలు కొన్నప్పుడూ మేమిలాంటి ప్రదర్శన చేయ లేద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos