ముంబై : ప్రస్తుత ఐపీఎల్లో ఆడుతున్న యువ పేసర్లు ప్రసిద్ కృష్ణ, నవ్దీప్ సైనీలు చక్కగా బౌల్ చేస్తున్నారని ఆసీస్ మాజీ ఫాస్ట బౌలర్ బ్రెట్లీ కితాబునిచ్చాడు. ఇప్పుడు భారత్లో యువ బౌలర్లందరూ రాణిస్తున్నారని చెప్పాడు. కృష్ణ 145 కి.మీ.కి పైగా వేగంతో బౌల్ చేస్తున్నాడని, నవ్దీప్ కూడా దాదాపు అదే విధంగా ఆడుతున్నాడని తెలిపాడు. యువ బౌలర్లు మంచి వేగంతో బంతులు వేస్తుండడం తనకు ముచ్చటగొలుపుతోందన్నాడు. భారత క్రికెట్కు ఇదెంతో ఉత్సాహాన్నిస్తుందని తెలిపాడు.