నెల్లూరు: వింజమూరు మండలంలోని చండ్రపడియాలో మంగళవారం రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీక్ కావటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ లీక్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది