ఏడిఎంకె పార్టీ తీర్థం పుచ్చుకున్న ఏఎంఎంకె పార్టీ నాయకులు

ఏడిఎంకె పార్టీ తీర్థం పుచ్చుకున్న ఏఎంఎంకె పార్టీ నాయకులు

హోసూరు : హోసూరులో  ఏఎంఎంకె పార్టీ నాయకులు జె.పి. చంద్రన్, కార్యకర్తలు మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఏడిఎంకె పార్టీ లో చేరారు. బాగలూరు రోడ్డులో గల ఏడిఎంకె పార్టీ కార్యాలయం లో బాలకృష్ణారెడ్డి…జె.పి. చంద్రన్ ప్రభృతులకు పార్టీ  కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి  బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏఎంఎంకె పార్టీని వీడి జె.పి.చంద్రన్‌ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఎడిఎంకె పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ఇకపై వారితో కలిసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని బాలకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఎంకె పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos