కరోనా వార్డును పరిశీలించిన లావణ్య హేమనాథ్

కరోనా వార్డును పరిశీలించిన లావణ్య హేమనాథ్

హొసూరు : ఇక్కడికి సమీపంలోని శూలగిరి యూనియన్ కామన్ దొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా కరోనా వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డును సూలగిరి చైర్ పర్సన్ లావణ్య హేమనాథ్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్నందున ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హొసూరు ప్రాంతంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకంగా కరోనా వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. కామన్ దొడ్డి ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా 50 పడకల కరోనా వార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా లావణ్య హేమనాథ్ వైద్యుల ద్వారా కరోనా వైద్య సన్నద్ధత గురించి తెలుసుకున్నారు.

సూలగిరి పారిశ్రామికంగా అభివృద్ధి కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ ప్రాంతంలోని కర్మాగారాల్లో పని చేస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా కరోనా వార్డును ఏర్పాటు చేశారని లావణ్య తెలిపారు. సూలగిరి బీడీవోలు విమల్, బాలాజీ, వైద్యశాఖ అధికారులు ఆమె వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos