లాలూకి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60లక్షల జరిమానా

లాలూకి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60లక్షల జరిమానా

రాంచీ : దాణా స్కామ్లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఇక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఇది దాణా కుంభకోణం ఐదో కేసు. బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసినపుడు రూ.950కోట్ల విలువైన దాణా అక్రమాలు సాగాయి. దోషిగా తేలటంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడు న్నర సంవత్సరాలుగా జైలుశిక్ష అనుభవిస్తూ అనారోగ్యం కారణాలతో ఇటీవలే పెరోల్పై విడుదలయ్యారు. 1996లో కేసు నమోదు కాగా 170 మంది నిందితులు.  వీరిలో 55 మంది ఇప్పటికే మరణించారు. తాజా కేసు 139. 35 కోట్ల రూపాయలకు సంబంధించినది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos