ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం లేదు

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం లేదు

పాట్నా: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మత పరమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణప్రతిష్టకు రామంటూ తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ జాబితాలో చేరారు. బుధవారం పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్ జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టకు హాజరు కావడం లేదని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos