గ్రనేడ్‌  దాడిలో ఐదు గురికి గాయాలు

గ్రనేడ్‌  దాడిలో ఐదు గురికి గాయాలు

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో శనివారం జరిగిన గ్రనేడ్‌  దాడిలో ఐదు గురు పౌరులు గాయపడ్డారు. శనివారం కొందరు ముష్కరులు శ్రీనగర్లోని లాల్చౌక్ సమీపంలోని హరిసింగ్ మార్కెట్ ప్రాంతంలో గ్రనేడ్ను విసిరారు. దీంతో ఐదు గురు పౌరులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ప్రాంతంలో తనిఖీలు ప్రారంభించారు. బజార్లో దాదాపు దుకాణాలన్నింటినీ మూసేసారు. కొన్ని అంగళ్లు మాత్రమే లావా దేవీలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆంక్షలు నలు ఎత్తివేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos