నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం..

నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం..

కర్నూలు జిల్లాలో నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం కలకలంరేపింది. మంత్రాలయం మండలం వగరూరు చెరువు కట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పూజారి సోమవారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా విగ్రహంపైన ఉండే తొమ్మిది శేషపడగల్లో నాలుగింటి తలలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఆయన స్థానికులకు విషయం చెప్పగా.. వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వగరూరుకు 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం దగ్గర ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయానికి తాళం వేసి ఉంటుంది. గతేడాది కూడా ఇలాగే విగ్రహంను ధ్వంసం చేశారని.. మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విగ్రహాలపై దాడులు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల్ని పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos