మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత బ్యాంకింగ్ సూచీల అండతో లాభాల్లోకి మళ్లింది. ట్రేడింగ్ ముగిసే వేళకు సెన్సెక్స్ 281 పాయింట్లు లాభపడి 37,385కి, నిఫ్టీ 93 పాయిట్లు లాభపడి 11,076కి చేరాయి. వేదాంత లిమి టెడ్ (2.72%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.61%), ఓఎన్జీసీ (2.34 %), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.79%), ఎస్బీఐ (1.69%) లాభపడ్డాయి. సన్ ఫార్మా (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-0. 83%), హెచ్డీఎఫ్సీ (-0.46%), ఐటీసీ (-0.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.10%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos