కుందూనదిలో నలుగురి గల్లంతు

కుందూనదిలో నలుగురి గల్లంతు

కమలాపురం : కడప జిల్లా కమలాపురం వద్ద కుందూ నదిలో నలుగురు గల్లంతయ్యారు. స్థానిక దర్గా వీధికి చెందిన జాఫర్ జాఫర్ హుస్సేన్(42), చిన్నారులు ఇర్ఫాన్ (12), జకీర్ (12), షాహీద్ (10) కుటుంబ సభ్యులతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు చేసి సరదాగా గడిపారు. అప్పటికే శ్రీశైలం నుంచి కుందూ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాయంత్రం వేళ నదిలో ప్రవాహం ఎక్కువైంది. దీంతో సరదాగా ఆడుకుంటున్న వారు ఒక్కసారిగా వరదలో కొట్టుకుపోయారు. జాఫర్ హుస్సేన్ మృతదేహం లభ్యమైంది. చిన్నారుల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos