అతనికి ఉరి సబబే : కేటీఆర్‌

హైదరాబాద్‌ : చిన్నారిపై అత్యాచారానికి సంబంధించిన కేసులో వరంగల్‌ జిల్లా కోర్టు దోషికి ఉరి శిక్ష విధించడం సబబేనని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. నేరానికి పాల్పడిన కామోన్మాది ప్రవీణ్‌ను మానవ మృగంగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి భయంకరమైన నేరగాళ్ల కోసం మరింత కఠినమైన చట్టాలు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు అవసరమని అభిప్రాయపడ్డారు. దోషికి శిక్ష పడేలా చేయడానికి కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos