బెంగళూరు హింసపై కేటీఆర్ స్పందన

బెంగళూరు హింసపై  కేటీఆర్ స్పందన

హైదరాబాదు: సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ నెటిజన్లకు విన్నవించారు. బెంగళూరులో ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఒకటి వివాదం రాజుకుని అల్లర్లకు దారి తీసింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయ పడ్డారు. ‘సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలుపుతోంది. బాధ్యతగా ఉండాలని సామాజిక మాధ్యమాలను వాడే అందరినీ నేను కోరుతున్నాను. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దు’ అని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos