కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు… క్విడ్ ప్రొకో

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు… క్విడ్ ప్రొకో

హైదరాబాదు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్విడ్ ప్రొకోకు పాల్పడ్డారని ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం చేసిన ట్వీట్ లో ఆరోపించారు. ‘ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా 6 నెలల క్రితం తన కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని కోమటి రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొన్న తన కంపెనీ ఈ కాంట్రాక్టును సాధించిందని చెప్పారు. ఈ వీడియోను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తన ట్వీట్కు కేటీఆర్ దీన్ని జత చేసారు. రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కినందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. ఇది క్విడ్ ప్రొకో కాక మరేమిటని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సాగితే మంచిదంటూ చురక అంటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos