హైదరాబాదు : ప్రధాని మోదీ చేసిన సూచనలు పాటించిన రైతు లు రెట్టింపు కంటే అధిక ఆదాయం రాబట్టారని కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటన ను రుజువు చేయా లని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండు చేసారు. ‘దేశంలో రెట్టింపు ఆదాయాన్ని సాధించిన రైతులు ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఈ రైతులు ఏఏ రాష్ట్రాలకు చెందిన వారు? వారి ఆదాయాల రెట్టింపునకు ఉపయోగపడిన ప్రభుత్వ పథకం ఏది? వెల్లడించాలని కోరారు.