హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు, ఆరోపణల్ని చేసిన మునుగోడు శాసనసభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నాయకత్వం తీర్మానించినట్లు ఈ చర్య వల్ల ఆయనకు రాజకీయ ఫిరాయింపుల నిషేధ చట్టం ఆంక్షల నుంచి రక్షణ లభిస్తుందనే అంశం గురించి న్యాయ కోవిదుల సలహాను తీసుకున్న తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. . ‘ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ కాంగ్రెస్లో నాయకత్వంలో లోపం ఉంది. నేతలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు’అని రాజగోపాల రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దరిమిలా రాజగోపాల్రెడ్డి భాజపాలో చేరతారనే ఊహాగానాల్ని ఆయన కొట్టి పారేశారు. నియోజక వర్గ నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే ఇదే పార్టీలో కొన సాగాలో లేక మరో పార్టీకి మారాలో నిర్ణయి స్తామని వివరించారు.