24 గంటల్లో 1059 మంది మృతి

న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1059 మంది కరోనా కు బలయ్యారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 59,449 కు చేరింది. కొత్తగా 67,151 మంది కరోనాకు గురయినట్లు గుర్తించారు. దీంతో మొత్తం ఈ వ్యాధి పీడితుల సంఖ్య 32,34,475కు చేరింది. ఇప్పటి వరకూ 24,67,759 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు మళ్లారని ఆరోగ్య సంక్షేమ శాఖ బుధవారం పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు భారత్ వైద్య పరిశోధన మండలి తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos