ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆర్జీవీ ప్రచారాలు ముమ్మరం చేశాడు.అందులో భాగంగా బుధవారం చిత్రం రెండో ట్రైలర్ విడుదల చేశాడు. “హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి, తమ మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు” అంటూ ప్రారంభమైన ఈ ట్రయిలర్ లో “ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి… ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే…” అన్న డైలాగులు ఉన్నాయి. ఆపై “కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం నాశనం చేశారు” అన్న డైలాగ్, అసెంబ్లీలో వైఎస్ జగన్ పాత్రధారి, చంద్రబాబు పాత్రధారిని హెచ్చరించడం, కొన్ని క్రైమ్ సీన్స్ ఈ ట్రయిలర్ లో కనిపిస్తున్నాయి.