చంద్రబాబు బీసీల ద్రోహి

చంద్రబాబు బీసీల ద్రోహి

అమరావతి: చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ముఖ్య మంత్రి జగన్ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ జగన్లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించిన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ‘‘బీసీల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని నాకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చారా?. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఎన్ని సార్లు అడిగినా బాబు స్పందించలేదు. బీసీలంతా ఎప్పటికీ జగన్ వెంటే ఉంటార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos