నిజమే చెప్పాను

నిజమే చెప్పాను

న్యూ ఢిల్లీ: దేశ ఉగ్రవాద మూలాలు హైదరాబాద్లో ఉన్నాయనేది పచ్చి నిజమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో సమర్ధించుకున్నారు. దేశంలో పలు చోట్ల ఉగ్ర వాద కార్యలాపాలు పెరుగటాన్నే చెప్పానన్నారు. ‘ బెంగళూరు, భోపాల్లోజరిగిన ఉగ్రవాద ఘటనల మూలాలు హైదరాబాద్లో కనబడుతున్నాయి. హైదరాబాద్లో ప్రతి రెండు, మూడు నెలలకు ఉగ్ర వాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారు. ఉగ్రవాదానికి మతం లేదనేది పార్టీ అభిప్రాయం కూడా’ అని కిషన్ రెడ్డి చెప్పారు. ముస్లింలను తాను ఉగ్రవాదులుగా ఎప్పుడూ పేర్కొనలేదని వివరించారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను మజ్లీస్ పార్టీ అధిపతి అసదుద్దీన్ ఖండించారు. దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేచింది. దరిమిలా కిషన్ రెడ్డి శనివారం వివరణ ఇచ్చారు. మరో వైపు వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసినందుకు ఆయన్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మందలించినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos