భాజపాకు వోటు పాక్‌పై బాంబు

భాజపాకు వోటు పాక్‌పై బాంబు

ముంబై: ‘భాజపాకు ఓటేస్తే పాకిస్తాన్పై అణు బాంబు వేసినట్ల’ని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. సోమ వారం బయందర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. జమ్మూ- కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలు రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పారు. ఓటర్లు కమలం గుర్తుకు వోటేస్తే భాజపా అభ్యర్థి నరేంద్ర మెహతా, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మాత్రమే సమర్థించినట్లు కాదు.పాకిస్తాన్ పై అణు బాంబు పడి నట్లు అర్థం. ఎన్నికల ఫలితాలు భారతీయుల నిజమైన దేశభక్తికి సూచిక’అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos