మమత తల వెల రూ. కోటి

కోల్కత: పశ్చిమ బంగలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపి ఆమె తల తెచ్చినా, లేక సజీవంగా పట్టుకుని తెచ్చి అప్పగించిన వారికి రూ. కోటి బహుమతి ఇస్తామని రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ లోక్సభ సభ్యుడు అపురూప పొద్దార్ కు అందిన లేఖ కల కలాన్ని సృష్టిస్తోంది. ఇందులో అతని చిరునామా, మూడు ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. లేఖతో ఆందోళనకు గురైన పొద్దార్ శీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వెంటనే రాజీవ్ కిల్లాను నిర్బంధించారు. ఆ లేఖతో తనకు ఎటువంటి సంబంధమూ లేనట్లు అతను స్ప
ష్టీ కరించినట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో గెలిచిన భాజపా, ఇటీవల ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాల్లో గెలిచింది. దరిమిలా రాష్ట్రంలో భాజపా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగు తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos