మోదీ, ‘దీదీ’ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

మోదీ, ‘దీదీ’ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

కోల్కతా: కొత్త సాగు చట్టాలు, మమతా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బుధవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి దీనికి నాయకత్వం వహించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ, టీఎంసీ పార్టీలను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రధాన పోటీదారులుగా టీఎంసీ, బీజేపీలు ప్రచారంలో ముందున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పార్టీలకు గట్టి పోటీని ఇచ్చేందుకు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos