విద్యుత్‌ తీగతో కోడెల ఉరి

విద్యుత్‌ తీగతో కోడెల ఉరి

హైదరాబాదు: మాజీ సభాపతి కోడెల శివ ప్రసాదరావు విద్యుత్ తీగతో ఉరి వేసుకున్నారని శవ పరీక్షలో తేలిందని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బుధవారం ఇక్కడ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ఆయన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుమతితో మాట్లాడారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు దీన్ని గుర్తించారు. ఇరవై 20 రోజుల కిందట కోడెల నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కూతురు, భార్య, అంగ రక్షకుడు, మెన్, డ్రైవర్తో బాటు మరో నలుగురిని ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా దాఖలు చేసారు. కోడెల వాడుతున్న మందుల్ని స్వాధీనం చేసుకు న్నారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా కేసును పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు కోడెల రకరకాలుగా యోచించినట్లు కూడా భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos