హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. బలవన్మరణానికి కారణాలేమిటి, చివరగా ఆయన ఎవరితో మాట్లాడారు…అనే అంశాలపై విచారణ సాగుతోంది. ఆయన మొబైల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాగా కోడెల భౌతిక కాయం ఇక్కడి నుంచి గుంటూరు చేరుకుంది. తెదేపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. నరసరావుపేటలో బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.