హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో జరగుతున్న అక్రమాలు, నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరామ్ మంగళవారం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. న్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరగాలని డిమాండు చేసారు.