హైదరాబాదు : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనున్న చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటించనున్నట్లు సినీ వర్గాల కథనం. సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపిక చేసినట్లు తొలి వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కైరా అద్వాని, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు, కైరా అద్వాని మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినందున ఆమెనే ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.