జమ్మూ: ఫూంచ్ జిల్లా కృష్ణగటి సెక్టారులోని సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున 3.30గంటలకు మోర్టార్ షెల్స్ తో పాక్ జవాన్లు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యాడు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టారులో కూడా సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపి పాక్ యత్నాలను తిప్పి కొట్టారు. పాకిస్థాన్ గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.