అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,727 మంది అనుమానితుల్ని పరీక్షించినపుడు 73 మందిని వ్యాధి పీడితులుగా గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. దీంతో మొత్తం రోగుల సంఖ్య 1332కు చేరింది. ఇప్పటి వరకు 287 మంది కోలుకున్నారు. 31 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 1014 మంది చికిత్స పొందుతున్నారు.