శ్రీనగర్:పుల్వామా జిల్లా, లస్సీపోరా వద్ద శుక్ర వారం ఉగ్ర వాదులు, భద్రతా బలగాల మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర వాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే సిరీస్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నపుడే వారి నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఆత్మరక్షణకు బలగాలూ కాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.