పుల్వామా కాల్పుల్లో ఇద్దరి బలి

పుల్వామా కాల్పుల్లో ఇద్దరి బలి

శ్రీనగర్: జమ్ము-కశ్మీర్, పుల్వామా జిల్లా అవంతిపొరా పరిధిలోని బ్రాబందిన ప్రాంతంలో శుక్రవారం జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు బలయ్యారు. ఉగ్ర వాదుల కోసం గాలిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఆత్మరక్షణకు జవాన్లు ఎదురు కాల్పులు జరిపినపుడు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల నుంచి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos