శ్రీనగర్ : రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారు సరిహద్దుల్లో గురువారం రాత్రి పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యారు. భారత సైనికుల ఎదురుకాల్పులు జరపడంతో పాక్ సైనికులు వెనుదిరిగారు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.