8న కియా కారు విడుదల

8న కియా కారు విడుదల

అమరావతి : అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంటు ద్వారా కియా కొత్త కారు సెల్తోస్‌ను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డికి తెలిపారు. సోమవారం అమరావతిలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో కియా ఎండీ, సీఈఓ ఉన్నారు. పెనుకొండ ప్లాంటు ద్వారా ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేయగలమని తెలిపారు. భవిష్యత్తులో ఏడు లక్షల కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటామని వారు వెల్లడించారు. మరో వైపు గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక, హోం శాఖల మంత్రులు పాల్గొన్నారు. బాధితులకు ఉదారంగా సాయం చేయాలని, సహాయక చర్యల్లో జాప్యానికి వీల్లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos