న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతి ఆయోగ్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సింధుశ్రీ ఖుల్లా ర్ ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం శనివారం అనుమతించింది. ఆమెతో పాటు కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మాజీ కార్య దర్శి అనూప్.కే.పూజారి, అప్పటి ఆర్థిక శాఖ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ అధీన కార్యదర్శి రవీంద్ర ప్రసాద్ లనూ విచారించేం దు కు అనుమతించింది. కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ చిదంబరం ఇదే కేసులో నిందితుడు.