న్యూఢిల్లీ : రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పదవీ విరమణ చేయనున్న గులాం నబీ ఆజాద్ స్థానంలో మల్లికార్జున్ ఖర్గేను అధిష్ఠానం నియమించింది. ఆయన గత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పని చేశారు. 2014 నుంచి మాత్రం రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నారు. 2009లో రాజ్యసభలో ప్రవేశిం చారు. ఈ నెల 15న ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది.