గుంటూరు:సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి కి గల కారణాల్ని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ సమీక్షిస్తున్న దశలో మాజీ మంత్రి రావెల కిశోర్ శనివారం హఠాత్తుగా భాజపా తలుపులు తట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన జనసేనకు రాజీనామా చేసారు. శనివారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని మోదీ సమక్షంలో ఆయన భాజపాలో తీర్థాన్ని పుచ్చుకుంటారు. పలువురు మండల స్థాయి నేతలు ఆయన్ను అనుసరించనున్నారని