ప్రస్తుత కాలంలో యువత తమ పెళ్లితో పాటు నిశ్చితార్థం,ప్రీవెడ్డింగ్ వేడుకలను జీవితాంతం గుర్తుంచుకునేలా ప్రత్యేకంగా ఫోటోషూట్,వీడియో తీయించుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది.సినిమాలో పాటలకు ఏమాత్రం తగ్గనివిధంగా ప్రీవెడ్డింగ్ తదితర కార్యక్రమాలను ఫోటోషూట్,వీడియోలు తీయించుకుంటున్నారు.అందుకోసం విభిన్న మార్గాలను సైతం వెతుక్కుంటున్నారు.ఈ క్రమంలో కేరళకు చెందిన జోస్,అనిషా అనే యువజంట తమ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ప్రత్యేకంగా ఉండాలనే భావనతో ప్రకృతి అందాల మధ్య పంటపొలాల్లో బురద నేలల్లో ఫోటో షూట్ చేయించుకున్నారు. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ బురదలోనే ఒకరితో ఒకరు అల్లుకుంటూ తీయించుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.యువజంట ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు..