కేజ్రీవాల్‌కు మరో షాక్?

కేజ్రీవాల్‌కు మరో షాక్?

న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్తో కలిసేందుకు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వ్యతిరేకించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని ఈడీ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈడీ ఈ వాదనలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ దరఖాస్తుపై ఉత్తర్వులను కోర్టు సోమవారానికి రిజర్వ్ చేసింది. అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, వారానికి ఒక గంట సమావేశ సమయం సరిపోదని కేజ్రీవాల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos