కొత్త చట్టంతో వాహన సంచారం మెరుగు

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త మోటారు వాహనాల చట్టంతో నగరంలో ట్రాఫిక్ పరిస్థితి చాలా వరకు మెరుగు పడిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశంసించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.మోటారు వాహనాల కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నగరంలో ట్రాఫిక్ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ఒకవేళ ఈ చట్టంలో ఏదైనా నిబంధన కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే జరిమానా తగ్గించే అధికారం మా చేతుల్లోనే ఉంది.ట్టి మేము తప్పకుండా ఆ పని చేస్తాం’ అని చెప్పారు. జరిమానాలు తగ్గిస్తామంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos