కేసీఅర్ కుటుంబంపై పోస్టులు

హైదరాబాదు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఎంపీ కవితపై ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన చిర్ప నరేశ్‌ను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేత జి.శ్రీనివాస్‌ యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన చిర్ప నరేశ్‌గా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.మోహన్‌రావు, ఎస్‌.మదన్, పోలీసు కానిస్టేబుల్‌చారి నేతృత్వంలోని బృందం నిందితుడు నరేశ్‌ను పట్టుకొని తీసుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos